పోస్ట్‌లు

అరుణాచల గిరి ప్రదక్షిణ (Girivalam) – మార్గం, దూరం, నియమాలు, పూర్తి గైడ్

చిత్రం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచల కొండ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఈ పవిత్ర కొండ చుట్టూ భక్తితో చేసే ప్రదక్షిణను అరుణాచల గిరి ప్రదక్షిణ లేదా గిరివలం (Girivalam) అని పిలుస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున మాత్రమే కాదు, సంవత్సరమంతా లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం, అరుణాచల కొండ స్వయంగా పరమశివుని అగ్నిలింగ స్వరూపం. అందువల్ల ఈ కొండ చుట్టూ చేసే ప్రతి అడుగు శివారాధనతో సమానమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే జీవితంలో కనీసం ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలని అనేక మంది సంకల్పిస్తారు. అరుణాచలం యాత్ర, శ్రీ అరుణాచలేశ్వర ఆలయం, అష్టలింగాలు, ఆశ్రమాలు మరియు ఇతర దర్శనీయ ప్రదేశాల గురించి పూర్తి సమాచారం కోసం మా " అరుణాచలం – పూర్తి పర్యాటక & ఆధ్యాత్మిక గైడ్ " వ్యాసాన్ని కూడా చదవండి. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? అరుణాచల కొండను కుడివైపు ఉంచుకుని, సుమారు 14 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన భక్తితో పూర్తి చేయడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. దీనిని తమిళంలో గిరివలం (Girivalam) అని పిలుస్తారు....

శ్రీ అరుణాచలేశ్వర ఆలయం (తిరువణ్ణామలై) – చరిత్ర, విశిష్టత, దర్శన సమయాలు, పూర్తి ఆలయ గైడ్

చిత్రం
శ్రీ అరుణాచలేశ్వర ఆలయం – అగ్నిలింగ స్వరూపుడి దివ్య క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై నగరంలో వెలసిన శ్రీ అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. పంచభూత లింగ క్షేత్రాలలో అగ్ని తత్త్వానికి ప్రతీకగా ఆరాధించబడే ఈ ఆలయం శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా కొనసాగుతోంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ పరమశివుడు కేవలం శివలింగ రూపంలో మాత్రమే కాకుండా, ఆలయం వెనుక ఉన్న అరుణాచల పర్వతం రూపంలో కూడా కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. అందువల్ల ఆలయ దర్శనం మరియు అరుణాచల పర్వతం రెండూ ఈ క్షేత్రంలో సమానమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజులు, మహాశివరాత్రి మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్తీక మహాదీపోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఈ వ్యాసంలో శ్రీ అరుణాచలేశ్వర ఆలయ చరిత్ర, పురాణ ప్రాముఖ్యత, నిర్మాణ విశేషాలు, ప్రధాన సన్నిధులు మరియు ఆలయ ఆధ్యాత్మిక వైభవం గురించి వివరంగా తెలుసుకుందాం. అరుణాచలం యాత్ర, గిరి ప్రదక్షిణ, అష్టలింగాలు, రమణ...

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం | చరిత్ర, దర్శన సమయం, ఎలా చేరుకోవాలి?

చిత్రం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి. ప్రకాశం జిల్లా, పాత సింగరాయకొండ (Old Singarayakonda) గ్రామంలో కొండపై వెలసిన ఈ పవిత్ర ఆలయం భక్తి, పురాణ ప్రాధాన్యం, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలతో భక్తులను ఆకర్షిస్తుంది. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో, ప్రకృతి సోయగాల మధ్య ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు సందర్శిస్తారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనంతో పాటు కొండపై నుంచి కనిపించే అందమైన దృశ్యాలు యాత్రికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. ఈ వ్యాసంలో సింగరాయకొండ దేవాలయ చరిత్ర, స్థల పురాణం, ఆలయ ప్రత్యేకతలు, ప్రధాన ఉత్సవాలు, దర్శన సమయం, ప్రయాణ మార్గాలు, సందర్శించడానికి ఉత్తమ సమయం వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సింగరాయకొండ అనే పేరు ఎలా వచ్చింది? స్థానికంగా ప్రచారంలో ఉన్న విశ్వాసం ప్రకారం, సింహరూపంలో అవతరించిన శ్రీ నరసింహస్వామి ఈ కొండపై వెలసిన కారణంగా ఈ ప్రాంతానికి “సింగరాయకొండ” అనే పేరు వచ్చిందని చెబుతారు. “సింహాలకు రాయడైన నరసింహస్వామి వెలసిన కొండ” అనే...

వడక్కునాథన్ దేవాలయం, త్రిసూర్, కేరళ

చిత్రం
వడక్కునాథన్ దేవాలయం (Vadakkunnathan Temple) కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. కైలాస అధిపతి అయిన మహా శివుడు, ఈ దేవాలయంలో "వడక్కు నాథర్"గా పూజలందుకుంటున్నారు. "వడ" అనగా ఉత్తర ప్రాంతం, "నాథర్" అంటే అధిపతి అని స్థానిక భాషలో అర్థం. వడక్కునాథన్ దేవాలయం కేరళలోనే కాక, భారతదేశంలోనూ అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. త్రిసూర్ నగరం "దక్షిణ కైలాసం"గా ప్రసిద్ధి పొందింది. 2017 సంవత్సరంలో యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. వడక్కునాథన్ ఆలయ స్థల పురాణం: వడక్కునాథన్ ఆలయ పూర్వకథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. పురాణ కథనం ప్రకారం, పరశురాముడు క్షత్రియులను తుదముట్టించిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం యజ్ఞం చేసి, తన భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు. తపస్సు చేయటానికి తగిన భూమి కోసం వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు, గొడ్డలిని సముద్రంలో విసిరితే విసిరినంత మేరకు భూమి లభిస్తుందని చెప్పాడు. పరశురాముడు గొడ్డలిని విసిరాడు, సముద్రం వెనక్కి వెళ్లి కొంత భూమిని ప్రసాదించింది. ఈ భూమి కేరళగా ప్రసిద్ధి చెందింది. ...

చావక్కాడ్ బీచ్: గురువాయూర్ తీరం‌లోని సుందర బీచ్

చిత్రం
గురువాయూర్ క్షేత్రానికి సమీపం‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలలో చావక్కాడ్ (చవక్కాడ్) బీచ్ ఒకటి. సుందమైన ఈ బీచ్ గురువాయూర్ పట్టణానికి సుమారు 5 కిమీల దూరం‌లో ఉన్న చావక్కాడ్ (Chavakkad) పట్టణానికి 2 కిమీల దూరం‌లో ఉన్నది. ఇక్కడ సమృద్ధిగా పెరిగే చేవల్ చెట్ల వలన ఈ ప్రాంతానికి చావక్కాడ్ అని పేరు వచ్చిందని స్ఠానికులు చెపుతారు. కూట్టుంగళ్ లేదా కూట్టుంగళంగడిగా పిలువబడే ఈ ప్రాంతం పూర్వ యుగంలో వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆంగ్లేయులు ఈ పట్టణాన్ని ‘చౌఘాట్’ అని పిలిచేవారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం వారు 1970ల ప్రారంభంలో చావక్కాడ్ పేరు మార్చినారు. చావక్కాడ్ బీచ్ 'అజిమోకం' (Azhimukham) అని పిలువబడే దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. మలయాళంలో అజిమోకం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం అని అర్థం. అరేబియా సముద్రపు తీరంలో జాతీయ రహదారి ప్రక్కనే గల ఈ బీచ్ కేరళలోని ఇతర బీచ్‌లతో పోలిస్తే రద్దీ తక్కువ. ఆధునీకరణ స్పృశించని ఈ బీచ్ చుట్టూ ఏపుగా పెరిగిన తాటి చెట్లతో ఎంతో ఆహ్లాదకరపు అనుభవం కలిగిస్తుంది. బీచ్‌లో మృదువైన ఇసుకతో ఎంతో పరిశుభ్రతగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను విశేషంగా...

పున్నత్తూర్‌ కోట: గురువాయూర్ ఏనుగులశాల

చిత్రం
భూలోక వైకుంఠమైన గురువాయూర్ నందు శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడని తెలుసు కదా! ఇక్కడ భక్తులు స్వామి వారిని దర్శించి వారు కోరిన కోరికలు నెరవేరిన తరువాత వారు స్వామి వారికి అనేక రకాల కానుకలను భక్తితో సమర్పిస్తారు. కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకగా ఏనుగులను కూడా సమర్పించుకొనే సంప్రదాయం ఇక్కడ ఉంది. అలా సమర్పించిన ఏనుగులు సుమారు 80 కి పైగా ఉన్నాయి. ఈ ఏనుగులను ఆలయానికి సుమారు 3 కిమీ దూరంలో ఉన్న పున్నత్తూర్‌ కోట (పున్నథూర్ కొట్టా) లో వున్న ఏనుగులశాలలో ఉంచి సం‌రక్షిస్తున్నారు. ఈ ఏనుగులు గురువాయూర్ దేవాలయం నిర్వహించే అనేక పండుగలలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రని పోషిస్తాయి. ఒకప్పడు స్థానిక పున్నత్తూర్ రాజ వంశీయులకు సంబంధించిన ఈ కోట మరియు ప్యాలెస్ గురువాయూర్ దేవస్ఠానం వారు 1975 సంవత్సరములో తమ ఆధీనములోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ మైదానం‌లో గురువాయూర్ ఆలయానికి చెందిన ఏనుగులను సంరక్షిస్తున్నారు. దీనికి "పున్నతుర్ అనక్కొట్ట" అని పేరు పెట్టారు, అనగా ‘ఏనుగుల కోట’ అని అర్ధం వస్తుంది. పున్నత్తూర్‌ కోటలోని స్ఠానిక ఆకర్షణలు: పున్నత్త...

మమ్మియూర్ శ్రీ మహదేవ దేవాలయం, గురువాయూర్

చిత్రం
మమ్మియూర్ శివాలయం కేరళ రాష్ట్రం‌లో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం గురువాయూర్ నందు కలదు. ఈ క్షేత్రాన్నే మమ్మియూర్ దేవాలయం లేదా మమ్మియూర్ మహాదేవ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీ గురువాయూరప్పన్ దేవాలయనికి సమీపం‌లో వాయువ్యంగా సుమారు 200 మీటర్ల దూరంలో ఈ మమ్మియూర్ మహాదేవుని ఆలయం కలదు. ఈ ఆలయం‌లో మహా శివుడు ఉమా మహేశ్వరుని రూపంలో పూజించబడుతున్నాడు. ఇక 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన శ్రీ కృష్ణ దేవాలయం గల ఊరు కనుక ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం. గురువాయురప్పన్ వెలసిన ఈ క్షేత్ర భూమికి యజమాని మహా శివుడు. అందువలన గురువాయూరు సందర్శించిన భక్తులు మమ్మీయూర్ నందు వెలిసిన మహాదేవున్ని దర్శించకపోతే గురువాయూరు పర్యటన సఫలం కాదని చెబుతారు. గురువాయురప్పన్ క్షేత్రం గురించి నేను ఇది వరకే వ్రాసిన పోస్ట్ సందర్శించుటకై ఇక్కడ క్లిక్ చేయండి స్థల పురాణం: దేవతల గురువైన బృహస్పతి మరియు వాయు దేవుడు గురువాయురప్పన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు తగిన ప్రదేశం కొరకు వెదుకుచూ పరశురామ క్షేత్రమైన కేరళ తీర ప్రాంతానికి వచ్చెను. అక్కడ మహా శివుడు ఒక సరస్సు ఒడ్డున తపస్సు చేయుచుండగా ఆ...