పోస్ట్‌లు

చావక్కాడ్ బీచ్: గురువాయూర్ తీరం‌లోని సుందర బీచ్

చిత్రం
గురువాయూర్ క్షేత్రానికి సమీపం‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలలో చావక్కాడ్ (చవక్కాడ్) బీచ్ ఒకటి. సుందమైన ఈ బీచ్ గురువాయూర్ పట్టణానికి సుమారు 5 కిమీల దూరం‌లో ఉన్న చావక్కాడ్ (Chavakkad) పట్టణానికి 2 కిమీల దూరం‌లో ఉన్నది. ఇక్కడ సమృద్ధిగా పెరిగే చేవల్ చెట్ల వలన ఈ ప్రాంతానికి చావక్కాడ్ అని పేరు వచ్చిందని స్ఠానికులు చెపుతారు. కూట్టుంగళ్ లేదా కూట్టుంగళంగడిగా పిలువబడే ఈ ప్రాంతం పూర్వ యుగంలో వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆంగ్లేయులు ఈ పట్టణాన్ని ‘చౌఘాట్’ అని పిలిచేవారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం వారు 1970ల ప్రారంభంలో చావక్కాడ్ పేరు మార్చినారు. చావక్కాడ్ బీచ్ 'అజిమోకం' (Azhimukham) అని పిలువబడే దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. మలయాళంలో అజిమోకం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం అని అర్థం. అరేబియా సముద్రపు తీరంలో జాతీయ రహదారి ప్రక్కనే గల ఈ బీచ్ కేరళలోని ఇతర బీచ్‌లతో పోలిస్తే రద్దీ తక్కువ. ఆధునీకరణ స్పృశించని ఈ బీచ్ చుట్టూ ఏపుగా పెరిగిన తాటి చెట్లతో ఎంతో ఆహ్లాదకరపు అనుభవం కలిగిస్తుంది. బీచ్‌లో మృదువైన ఇసుకతో ఎంతో పరిశుభ్రతగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను విశేషంగా

పున్నత్తూర్‌ కోట: గురువాయూర్ ఏనుగులశాల

చిత్రం
భూలోక వైకుంఠమైన గురువాయూర్ నందు శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడని తెలుసు కదా! ఇక్కడ భక్తులు స్వామి వారిని దర్శించి వారు కోరిన కోరికలు నెరవేరిన తరువాత వారు స్వామి వారికి అనేక రకాల కానుకలను భక్తితో సమర్పిస్తారు. కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకగా ఏనుగులను కూడా సమర్పించుకొనే సంప్రదాయం ఇక్కడ ఉంది. అలా సమర్పించిన ఏనుగులు సుమారు 80 కి పైగా ఉన్నాయి. ఈ ఏనుగులను ఆలయానికి సుమారు 3 కిమీ దూరంలో ఉన్న పున్నత్తూర్‌ కోట (పున్నథూర్ కొట్టా) లో వున్న ఏనుగులశాలలో ఉంచి సం‌రక్షిస్తున్నారు. ఈ ఏనుగులు గురువాయూర్ దేవాలయం నిర్వహించే అనేక పండుగలలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రని పోషిస్తాయి. ఒకప్పడు స్థానిక పున్నత్తూర్ రాజ వంశీయులకు సంబంధించిన ఈ కోట మరియు ప్యాలెస్ గురువాయూర్ దేవస్ఠానం వారు 1975 సంవత్సరములో తమ ఆధీనములోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ మైదానం‌లో గురువాయూర్ ఆలయానికి చెందిన ఏనుగులను సంరక్షిస్తున్నారు. దీనికి "పున్నతుర్ అనక్కొట్ట" అని పేరు పెట్టారు, అనగా ‘ఏనుగుల కోట’ అని అర్ధం వస్తుంది. పున్నత్తూర్‌ కోటలోని స్ఠానిక ఆకర్షణలు: పున్నత్త

మమ్మియూర్ శ్రీ మహదేవ దేవాలయం, గురువాయూర్

చిత్రం
మమ్మియూర్ శివాలయం కేరళ రాష్ట్రం‌లో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం గురువాయూర్ నందు కలదు. ఈ క్షేత్రాన్నే మమ్మియూర్ దేవాలయం లేదా మమ్మియూర్ మహాదేవ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీ గురువాయూరప్పన్ దేవాలయనికి సమీపం‌లో వాయువ్యంగా సుమారు 200 మీటర్ల దూరంలో ఈ మమ్మియూర్ మహాదేవుని ఆలయం కలదు. ఈ ఆలయం‌లో మహా శివుడు ఉమా మహేశ్వరుని రూపంలో పూజించబడుతున్నాడు. ఇక 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన శ్రీ కృష్ణ దేవాలయం గల ఊరు కనుక ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం. గురువాయురప్పన్ వెలసిన ఈ క్షేత్ర భూమికి యజమాని మహా శివుడు. అందువలన గురువాయూరు సందర్శించిన భక్తులు మమ్మీయూర్ నందు వెలిసిన మహాదేవున్ని దర్శించకపోతే గురువాయూరు పర్యటన సఫలం కాదని చెబుతారు. గురువాయురప్పన్ క్షేత్రం గురించి నేను ఇది వరకే వ్రాసిన పోస్ట్ సందర్శించుటకై ఇక్కడ క్లిక్ చేయండి స్థల పురాణం: దేవతల గురువైన బృహస్పతి మరియు వాయు దేవుడు గురువాయురప్పన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు తగిన ప్రదేశం కొరకు వెదుకుచూ పరశురామ క్షేత్రమైన కేరళ తీర ప్రాంతానికి వచ్చెను. అక్కడ మహా శివుడు ఒక సరస్సు ఒడ్డున తపస్సు చేయుచుండగా ఆ

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

చిత్రం
గురువాయూర్ కేరళ రాష్ట్రం‌లో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడు. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రాన్ని భూలోక శ్రీ వైకుంఠం అని, కలియుగ వైకుంఠం అని భక్తులు భావిస్తూ స్వామి వారిని దర్శించి తరిస్తుంటారు. దేవతల గురువైన బృహస్పతి వాయిదేవుని తోడ్పాటుతో ఈ క్షేత్రం‌‌లో విగ్రహ ప్రతిష్టాపన చేయడం వలన, 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన దేవాలయం గల ఊరు కనుక 'గురువాయూర్' లేదా ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం. గురువాయూరు ఆలయ చరిత్ర తెలిపే మురళ్ పెయింట్ గురువాయూర్ విగ్రహ ప్రత్యేకత: గురువాయూర్ ఆలయ గర్బగుడిలోని విగ్రహం అయిదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడే అపూర్వమైన పాలరాతి అంజన శిలతో (పాతాళ శిల) మలచబడినది. ఈ రాయి చూడటానికి నీలపు రంగులో ఉంటుంది. ఇటువంటి విగ్రహం ప్రపంచం‌లో ఇంకొకటి లేదని చెపుతారు. స్వామి వారు శ్రీ మహా విష్ణువు రూపం‌లో చతుర్భుజములతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం (గద) మరియు పద్మము ధరించి బాల గోపాలునిగా దర్శనమిస్తారు. ఆలయ ప్రవేశద్వారం గురువాయూర్ స్థల ప

ఉడుపి సమీపంలోని అందమైన ద్వీపాల సమూహం సెయింట్ మేరీస్ ద్వీపం

చిత్రం
సెయింట్ మేరీస్ ద్వీపం ఉడుపి సమీపంలోని మల్పే బీచ్‌కు ఉత్తరాన ఉన్న చిన్న అందమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీపం‌లోని తెల్లని ఇసుక బీచ్‌లు, ఏకరాతి స్ఫటికాకార శిలలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. సాధారణంగా యాత్రికులు ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించిన తరువాత ఉడుపికి దగ్గరలో వున్న ఈ ద్వీపాన్ని సందర్శిస్తుంటారు. ఉడుపి ప్యాకేజీలలో భాగంగా సందర్శించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. అరేబియా సముద్రం‌లోని ఈ ద్వీపం కోకోనెట్ ఐల్యాండ్, నార్త్ ఐల్యాండ్, సౌత్ ఐల్యాండ్ మరియు దర్యాబహదూర్‌గర్ ఐల్యాండ్ అనే నాలుగు ద్వీపాల సమూహం. ఈ ద్వీపం అంతటా చెల్లాచెదురుగా ఉన్న ప్రత్యేకమైన స్ఫటికాకార రాళ్ళు ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రకృతి దృశ్యాన్ని అందిస్తాయి. అగ్ని పర్వతం నుండి వెలువడిన లావా వలన ఇటువంటి రాళ్ళు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ స్ఫటికాకార శిలలపై నిలబడి సూర్యాస్తమయాన్ని వీక్షించడం ద్వీపంలో అత్యంత ఆకర్షణీయమైన అనుభవాలలో ఒకటి. భౌగోళిక ప్రాముఖ్యత: సుమారు 88 మిలియన్ సంవత్సరాల క్రితం మడగాస్కర్ భారత భూభాగం‌లో కలిసి వుండేవి. కాలక్రమం‌లో మడగాస్కర్ భారత భూభాగం నుంచి వేరుపడిన సమయం‌లో ఈ దీవులు ఏర్పడినట్లు

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం

చిత్రం
ఉడుపి లేదా ఉడిపిలో నెలకొని వున్న శ్రీ కృష్ణ ఆలయం ప్రసిద్ద వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణుడు బాల కృష్ణుని రూపం‌లో వెలసిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో బెంగళూరుకు సుమారు 500 కిలో మీటర్ల దూరం‌లో మరియు మంగుళూరుకు 80 కిలో మీటర్ల దూరం‌లో పచ్చని కొండల మధ్య ప్రశాంత సముద్ర తీరం‌లో నెలకొని ఉంది. పురాణ ప్రాశస్థం: పురాణ కధనం ప్రకారం చంద్రుడు ఈ ప్రాంతం‌లో దక్ష శాప విముక్తికై తపస్సు చేసి మహా శివుని తలపై శాశ్వత స్ఠానం పొందాడని, అందుకే ఈ ప్రాంతానికి ఉడు రాజు (చంద్రుని) అనే పదాన్ని అనుసరించి ఉడుపి అనే పేరు వచ్చినట్లుగా చెపుతారు. అందుకు ప్రామాణికంగా ఇక్కడ వున్న చంద్ర మౌళీశ్వరాలయం చూడవచ్చు. చారిత్రక ప్రాశస్థం: ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన శ్రీ మద్వాచార్యులు విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ప్రతిష్టింపజేసినట్లుగా చారిత్రక ఆధారాలు కలవు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ద్వారక నుండి ఇక్కడకి వచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. ఒకరోజు ద్వారక నుంచి సరుకుల రవాణా చేస్తున్న ఒక ఓడ గాలివానకు సముద్రం‌లో చిక్కుకుంది. అప్పుడు సముద్ర తీరం‌లో పూజలు నిర్వహిస్తున్న శ్రీ మద్వాచార్యులు తన మం

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

చిత్రం
శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర