ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉడుపి సమీపంలోని అందమైన ద్వీపాల సమూహం సెయింట్ మేరీస్ ద్వీపం


సెయింట్ మేరీస్ ద్వీపం ఉడుపి సమీపంలోని మల్పే బీచ్‌కు ఉత్తరాన ఉన్న చిన్న అందమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీపం‌లోని తెల్లని ఇసుక బీచ్‌లు, ఏకరాతి స్ఫటికాకార శిలలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. సాధారణంగా యాత్రికులు ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించిన తరువాత ఉడుపికి దగ్గరలో వున్న ఈ ద్వీపాన్ని సందర్శిస్తుంటారు. ఉడుపి ప్యాకేజీలలో భాగంగా సందర్శించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

అరేబియా సముద్రం‌లోని ఈ ద్వీపం కోకోనెట్ ఐల్యాండ్, నార్త్ ఐల్యాండ్, సౌత్ ఐల్యాండ్ మరియు దర్యాబహదూర్‌గర్ ఐల్యాండ్ అనే నాలుగు ద్వీపాల సమూహం. ఈ ద్వీపం అంతటా చెల్లాచెదురుగా ఉన్న ప్రత్యేకమైన స్ఫటికాకార రాళ్ళు ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రకృతి దృశ్యాన్ని అందిస్తాయి. అగ్ని పర్వతం నుండి వెలువడిన లావా వలన ఇటువంటి రాళ్ళు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ స్ఫటికాకార శిలలపై నిలబడి సూర్యాస్తమయాన్ని వీక్షించడం ద్వీపంలో అత్యంత ఆకర్షణీయమైన అనుభవాలలో ఒకటి.

భౌగోళిక ప్రాముఖ్యత:

సుమారు 88 మిలియన్ సంవత్సరాల క్రితం మడగాస్కర్ భారత భూభాగం‌లో కలిసి వుండేవి. కాలక్రమం‌లో మడగాస్కర్ భారత భూభాగం నుంచి వేరుపడిన సమయం‌లో ఈ దీవులు ఏర్పడినట్లు చెపుతారు.


చారిత్రక ప్రాముఖ్యత:

1498 సంవత్సరములో పోర్చుగీసు నావికుడు వాస్కో-డ-గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే సమయంలో కప్పడ్ బీచ్ (కాలికట్ సమీపంలో) చేరుకోవడానికి ముందుగా ఈ ద్వీపానికి చేరుకున్నాడని చెబుతారు. వాస్కో-డ-గామా ఈ ద్వీపాలలో ఒకదానికి పోర్చుగీస్ భాషలో “ఓ పాద్రావో డి శాంటా మారియా” అని నామకరణం చేశాడు. ఆ పేరు నుండే ఈ ద్వీపానికి ప్రస్తుత పేరు వచ్చింది.

సెయింట్ మేరీస్ ద్వీపాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం:

ఈ ద్వీపాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి జనవరి మధ్య కాలం అనుకూలంగా ఉంటుంది, ఈ నెలల్లో ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు బీచ్‌కి వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి.

సెయింట్ మేరీస్ ద్వీపం చుట్టూ సందర్శనా స్థలాలు:

ఉడుపిలోని శ్రీ కృష్ణాలయం, దర్యాబహదూర్‌ఘర్ కోట, వడభండేశ్వర ఆలయం మరియు మల్పే బీచ్‌లు సెయింట్ మేరీస్ ద్వీపం చుట్టూ వున్న ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

వాటర్ స్పోర్ట్స్:

సెయింట్ మేరీస్ ద్వీపంలో పర్యాటకులకు ఇక్కడి వాటర్ స్పోర్ట్స్ మరిచిపోలేని అనుభూతినిస్తాయి.

సెయింట్ మేరీస్ ద్వీపంలో ఆహారం:

ఈ ద్వీపం జనావాసాలు లేనిది కావున పర్యాటకులు స్నాక్స్, డ్రింక్స్ తమ వెంట తీసుకువెళ్ళటం ఉత్తమం.

సెయింట్ మేరీస్ ద్వీపాన్ని సందర్శించు పర్యాటకులకు సూచనలు:

ఈ ద్వీపంలో రాత్రి పూట ఉండటానికి అనుమతినివ్వరు. అందువలన పర్యాటకులు తమ సౌకర్యం కొరకు అవసరమైన మందులు మరియు ఎండతీవ్రత తట్టుకోవడం కోసం సన్‌స్క్రీన్ లోషన్స్, టోపీలు, త్రాగునీటిని తీసుకువెళ్లండి.

సెయింట్ మేరీస్ ద్వీపానికి ఎలా చేరుకోవాలి:


సెయింట్ మేరీస్ ద్వీపం ఉడుపిలోని మల్పే బీచ్‌ తీరం నుండి 4 మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంలోకి ప్రవేశించడానికి పడవలు మాత్రమే ఏకైక మార్గం. ఈ ద్వీపానికి చేరుకోవాలంటే ముందుగా ఉడుపి చేరుకొని అక్కడి నుంచి మల్ఫే పోర్ట్ చేరుకోవాలి. మల్పేకి చేరుకోవడానికి ఆటోరిక్షాలు లేదా క్యాబ్ సౌకర్యం ఉన్నది. మల్ఫే పోర్ట్ నుండి ఫెర్రీ సేవల ద్వారా మాత్రమే ఈ ద్వీపం చేరుకోవచ్చు. సుమారు 25-30 నిమిషాల సమయం‌లో సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం తరువాత సెయింట్ మేరీస్ చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలే కాకుండా స్పీడ్ బోట్ సదుపాయం కూడా ఉన్నది.

ఫెర్రీ రైడ్‌ల సమయాలు :
ఫెర్రీ రైడ్‌లు సాధారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయం‌లో ప్రారంభమవుతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో ఇది మూసివేయబడుతుంది.

ఫెర్రీ రైడ్‌ ఖర్చు :
ఫెర్రీ రైడ్‌కు ఒక్కొక్కరికి సుమారుగా 300 నుంచి 400 ఖర్చు అవుతుంది. ఫెర్రీ పూర్తిగా నిండిన తర్వాత మాత్రమే రైడ్ ప్రారంభమవుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...