గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం
గురువాయూర్ కేరళ రాష్ట్రంలో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్గా పూజలందుకొంటున్నాడు. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రాన్ని భూలోక శ్రీ వైకుంఠం అని, కలియుగ వైకుంఠం అని భక్తులు భావిస్తూ స్వామి వారిని దర్శించి తరిస్తుంటారు. దేవతల గురువైన బృహస్పతి వాయిదేవుని తోడ్పాటుతో ఈ క్షేత్రంలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం వలన, 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన దేవాలయం గల ఊరు కనుక 'గురువాయూర్' లేదా ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం. గురువాయూరు ఆలయ చరిత్ర తెలిపే మురళ్ పెయింట్ గురువాయూర్ విగ్రహ ప్రత్యేకత: గురువాయూర్ ఆలయ గర్బగుడిలోని విగ్రహం అయిదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడే అపూర్వమైన పాలరాతి అంజన శిలతో (పాతాళ శిల) మలచబడినది. ఈ రాయి చూడటానికి నీలపు రంగులో ఉంటుంది. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో ఇంకొకటి లేదని చెపుతారు. స్వామి వారు శ్రీ మహా విష్ణువు రూపంలో చతుర్భుజములతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం (గద) మరియు పద్మము ధరించి బాల గోపాలునిగా దర్శనమిస్తారు. ఆలయ ప్రవేశద్వారం గురువాయూర్ స్థల ప