ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఉడుపి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం

ఉడుపి లేదా ఉడిపిలో నెలకొని వున్న శ్రీ కృష్ణ ఆలయం ప్రసిద్ద వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణుడు బాల కృష్ణుని రూపం‌లో వెలసిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో బెంగళూరుకు సుమారు 500 కిలో మీటర్ల దూరం‌లో మరియు మంగుళూరుకు 80 కిలో మీటర్ల దూరం‌లో పచ్చని కొండల మధ్య ప్రశాంత సముద్ర తీరం‌లో నెలకొని ఉంది. పురాణ ప్రాశస్థం: పురాణ కధనం ప్రకారం చంద్రుడు ఈ ప్రాంతం‌లో దక్ష శాప విముక్తికై తపస్సు చేసి మహా శివుని తలపై శాశ్వత స్ఠానం పొందాడని, అందుకే ఈ ప్రాంతానికి ఉడు రాజు (చంద్రుని) అనే పదాన్ని అనుసరించి ఉడుపి అనే పేరు వచ్చినట్లుగా చెపుతారు. అందుకు ప్రామాణికంగా ఇక్కడ వున్న చంద్ర మౌళీశ్వరాలయం చూడవచ్చు. చారిత్రక ప్రాశస్థం: ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన శ్రీ మద్వాచార్యులు విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ప్రతిష్టింపజేసినట్లుగా చారిత్రక ఆధారాలు కలవు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ద్వారక నుండి ఇక్కడకి వచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. ఒకరోజు ద్వారక నుంచి సరుకుల రవాణా చేస్తున్న ఒక ఓడ గాలివానకు సముద్రం‌లో చిక్కుకుంది. అప్పుడు సముద్ర తీరం‌లో పూజలు నిర్వహిస్తున్న శ్రీ మద్వాచార్యులు తన మం...