ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పున్నత్తూర్‌ కోట: గురువాయూర్ ఏనుగులశాల

భూలోక వైకుంఠమైన గురువాయూర్ నందు శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడని తెలుసు కదా! ఇక్కడ భక్తులు స్వామి వారిని దర్శించి వారు కోరిన కోరికలు నెరవేరిన తరువాత వారు స్వామి వారికి అనేక రకాల కానుకలను భక్తితో సమర్పిస్తారు. కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకగా ఏనుగులను కూడా సమర్పించుకొనే సంప్రదాయం ఇక్కడ ఉంది. అలా సమర్పించిన ఏనుగులు సుమారు 80 కి పైగా ఉన్నాయి. ఈ ఏనుగులను ఆలయానికి సుమారు 3 కిమీ దూరంలో ఉన్న పున్నత్తూర్‌ కోట (పున్నథూర్ కొట్టా) లో వున్న ఏనుగులశాలలో ఉంచి సం‌రక్షిస్తున్నారు. ఈ ఏనుగులు గురువాయూర్ దేవాలయం నిర్వహించే అనేక పండుగలలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రని పోషిస్తాయి.


ఒకప్పడు స్థానిక పున్నత్తూర్ రాజ వంశీయులకు సంబంధించిన ఈ కోట మరియు ప్యాలెస్ గురువాయూర్ దేవస్ఠానం వారు 1975 సంవత్సరములో తమ ఆధీనములోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ మైదానం‌లో గురువాయూర్ ఆలయానికి చెందిన ఏనుగులను సంరక్షిస్తున్నారు. దీనికి "పున్నతుర్ అనక్కొట్ట" అని పేరు పెట్టారు, అనగా ‘ఏనుగుల కోట’ అని అర్ధం వస్తుంది.

పున్నత్తూర్‌ కోటలోని స్ఠానిక ఆకర్షణలు:

పున్నత్తూర్‌ కోటలో కేరళ సంప్రదాయం‌ ప్రకారం నిర్మించిన దీర్ఘచతురస్రాకార ఇల్లు ఉంది. దీనిని ‘నాళు కెట్టు’ (naalu kettu) అని పిలుస్తారు. ఇది పున్నతుర్ రాజాకు సంబంధించిన మధ్య ప్రాంగణం కలిగిన సాంప్రదాయ దీర్ఘచతురస్రాకార ఇల్లు. ఇది ప్రస్తుతం పాపన్స్ (మహౌట్) కోసం శిక్షణా పాఠశాలను కలిగి ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి సేవ చేయడానికి ఇవ్వడానికి అలాగే ఏడాది పొడవునా జరిగే అనేక పండుగలలో పాల్గొనడానికి ఏనుగులకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రాంగణం‌లో మాహా శివుడు మరియు భగవతి దేవికి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఏనుగులకు స్నానం చేయించడాన్ని, గజపూజ (ఏనుగులను పూజించడం) మరియు అనయూట్టు (ఏనుగులకు ఆహారం ఇవ్వడం) వంటి వాటిని చూడవచ్చు.

Image: Naalu kettu, Courtesy by Wikipedia

గురువాయూర్ ఏనుగులలో ‘కేశవన్‘ అన్న ఏనుగు ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. కేశవన్ సత్ప్రవర్తనతో గురువాయురప్పకు సేవ చేసిందని గజరాజు బిరుదును కూడా ఇచ్చారు. 1975 లో వచ్చిన మలయాళ సినిమా ‘గురువాయూర్ కేశవ’ సినిమాకు ఈ ఏనుగు ప్రేరణగా చెబుతారు. అలాగే మమ్ముట్టి నటించిన ప్రముఖ మలయాళ చిత్రం "ఒరు వడక్కన్ వీరగాథ" లోని కొన్ని సన్నివేశాలను ఈ ప్రదేశంలో చిత్రీకరించారు.

స్ఠానిక ఇతర ఆకర్షణలు:

గురువాయురప్పన్ ఆలయం, మమ్మీయూర్ మహాదేవాలయం, మ్యూజియం, తిరు వెంకటాచలపతి ఆలయం, పార్ధసారధి ఆలయం, నెన్ మెని బలరామ ఆలయం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మురళ్ పెయింట్స్, చవకాడ్ బీచ్, పాలయూర్ చర్చి మొదలైనవి.

ఇతర బ్లాగ్ ఆర్టికల్స్ కొరకు వీటిపై క్లిక్ చేయండి.

పున్నత్తూర్‌ కోట ప్రవేశ సమయాలు:

గురువాయూర్ టెంపుల్ సందర్శించిన యాత్రికులు విరామ సమయం‌లో ఈ పున్నత్తూర్‌ కోటను సందర్శించవచ్చు. పున్నత్తూర్‌ కోటలోనికి ప్రవేశించుటకు ప్రత్యేక ప్రవేశ రుసుము చెల్లించాలి. సందర్శన వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 5.00 వరకు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.10. కాంప్లెక్స్ లోపల కెమెరాను ఉపయోగించేందుకు అదనంగా రూ. 25 వసూలు చేస్తారు. ఇప్పుడు పున్నతుర్కోటలో కెమెరా వినియోగం అనుమతించబడదు

పున్నత్తూర్‌ కోటకి ఎలా చేరుకోవాలి?

గురువాయూర్ ఆలయం నుంచి పున్నత్తూర్‌ కోట సుమారు 3 కిమీ దూరంలో దూరంలో నెలకొని ఉంది. గురువాయురప్పన్ ఆలయం నుండి నడక ద్వారా లేదా ఆటో ద్వారా పున్నత్తూర్‌ కోట చేరుకోవచ్చు. గురువాయూర్ బస్సు లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చును.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...