ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చావక్కాడ్ బీచ్: గురువాయూర్ తీరం‌లోని సుందర బీచ్


గురువాయూర్ క్షేత్రానికి సమీపం‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలలో చావక్కాడ్ (చవక్కాడ్) బీచ్ ఒకటి. సుందమైన ఈ బీచ్ గురువాయూర్ పట్టణానికి సుమారు 5 కిమీల దూరం‌లో ఉన్న చావక్కాడ్ (Chavakkad) పట్టణానికి 2 కిమీల దూరం‌లో ఉన్నది. ఇక్కడ సమృద్ధిగా పెరిగే చేవల్ చెట్ల వలన ఈ ప్రాంతానికి చావక్కాడ్ అని పేరు వచ్చిందని స్ఠానికులు చెపుతారు.


కూట్టుంగళ్ లేదా కూట్టుంగళంగడిగా పిలువబడే ఈ ప్రాంతం పూర్వ యుగంలో వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆంగ్లేయులు ఈ పట్టణాన్ని ‘చౌఘాట్’ అని పిలిచేవారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం వారు 1970ల ప్రారంభంలో చావక్కాడ్ పేరు మార్చినారు.

చావక్కాడ్ బీచ్ 'అజిమోకం' (Azhimukham) అని పిలువబడే దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. మలయాళంలో అజిమోకం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం అని అర్థం.


అరేబియా సముద్రపు తీరంలో జాతీయ రహదారి ప్రక్కనే గల ఈ బీచ్ కేరళలోని ఇతర బీచ్‌లతో పోలిస్తే రద్దీ తక్కువ. ఆధునీకరణ స్పృశించని ఈ బీచ్ చుట్టూ ఏపుగా పెరిగిన తాటి చెట్లతో ఎంతో ఆహ్లాదకరపు అనుభవం కలిగిస్తుంది. బీచ్‌లో మృదువైన ఇసుకతో ఎంతో పరిశుభ్రతగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

చవక్కాడ్‌ ప్రాంతంలో నివసించేవారు ఎక్కువమంది మధ్యప్రాచ్యంలో పనిచేస్తున్నారు. అందువల్ల ఈ ప్రదేశాన్ని మినీ గల్ఫ్ అని కూడా అంటారు.


స్థానిక ఆకర్షణలు:

చావక్కాడ్ మత సామరస్యానికి మరియు ప్రజల మధ్య భిన్నత్వానికి ప్రతీక.చావక్కాడ్‌లో ప్రసిద్ధి చెందిన మనతల జుమా మసీదు కలదు. చావక్కాడ్‌లోని పలయూర్‌ (Palayoor)లో క్రీ.శ. 52 సంవత్సరంలో సెయింట్ థామస్ స్థాపించిన సెయింట్ థామస్ చర్చి (St. Thomas Major archiepiscopal church) ప్రసిద్ధిగాంచినది, ఇది దక్షిణాసియాలో మొదటి చర్చి అని భావిస్తారు. మనతల విశ్వనాథ దేవాలయం చవక్కాడ్‌లోని మరో ముఖ్య ఆకర్షణ.

గురువాయూర్ ఇతర ఆకర్షణల బ్లాగ్ ఆర్టికల్స్ కొరకు వీటిపై క్లిక్ చేయండి.


చావక్కాడ్ బీచ్‌కి ఎలా చేరుకోవాలి?

చావక్కాడ్ పట్టణం జాతీయ రహదారి 66 పై కొచ్చి నగరానికి ఉత్తరాన 75 కిమీ, త్రిసూర్‌కు వాయువ్యంగా 25 కిమీ మరియు పొన్నానికి దక్షిణంగా 24 కిమీ దూరంలో ఉంది.

గురువాయూర్ పట్టణం నుంచి చావక్కాడ్ బీచ్ సందర్శించే పర్యాటకులు ప్రధాన పట్టణం చేరుకోవడానికి ముందుగానే బీచ్ చేరుకోవచ్చు. గురువాయూర్ నుండి ప్రవేట్ వాహనాలు, ఆటోల లేదా KRTC బస్సుల ద్వారా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం:
జాతీయ రహదారి 66 చావక్కాడ్ పట్టణం గుండా వెళుతుంది. కేరళలోని అన్నీ ముఖ్య పట్టణాల నుండి తరచుగా ప్రైవేట్ మరియు KRTC బస్సులు కలవు.

రైలు మర్గం:
చావక్కాడ్‌కు సమీపంలోని రైల్వే స్టేషన్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గురువాయూర్. గురువాయూర్ రైల్వే స్టేషన్ త్రిస్సూర్-గురువాయూర్ సెక్షన్‌లో ఉంది. త్రిసూర్ రైల్వే స్టేషన్ చవక్కాడ్‌కు సమీపంలో ఉన్న ప్రధాన రైలు కేంద్రం.

వాయు మార్గం:
80 కి.మీ దూరంలో ఉన్న నెడుంబస్సేరి వద్ద ఉన్న కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. అన్ని అంతర్జాతీయ, దేశీయ మరియు చార్టర్డ్ విమానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కరిపూర్ వద్ద కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం 104 కి.మీ దూరంలో ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...