ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భారత పార్లమెంటు భవనానికి స్పూర్తి అయిన చౌసత్ యోగిని ఆలయం


పార్లమెంటు భవన్ అనేది భారత దేశం యొక్క అత్యున్నత చట్ట సభ. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన దీనినే పార్లమెంటు హౌస్ లేదా సంసద్ అని పిలుస్తారు. (సంసద్ అంటే సంస్కృతం‌లో ఇల్లు లేక భవనం అని అర్ధం). ఈ భవనం క్రొత్త ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో వలయాకార నిర్మాణం‌లో వుండి ప్రధాన ఆకర్షణగా రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌కు కూతవేటు దూరం‌లో కలదు. వృత్తాకారం‌లో నిర్మింపబడిన ఈ బిల్డిం‌‌‌గ్ కాంప్లెక్స్ మధ్యలో 144 స్తం‌భాలతో కూడిన వరండా కలిగిన గోపురం‌తో సెంట్రల్ హాల్ ఎంతో ఠీవిగా నిలుస్తుంది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఇందులో విస్త్రతమైన గ్రంధ సేకరణతో కూడిన ఒక గొప్ప గ్రంధాలయం, వివిధ మంత్రి వర్గ కార్యాలయాలు వాటికి అనుబంధ కార్యాలయములు కొలవై ఉన్నాయి.

భారత దేశాన్ని ఈస్టిండియా కంపెని వారు ఢిల్లీ రాజధానిగా పాలించాలని నిర్ణయించాక పరిపాలనా భవనాల నిర్మాణాలను చేపట్టారు. అందుకోసం సర్ ఎడ్డిన్ లూటెన్స్, సర్ హెర్బెర్ట్ అనే ఇద్దరు బ్రిటిష్ ఇంజనీర్లను నియమించారు. వీరిలో సర్ ఎడ్డిన్ లూటెన్స్ మధ్యప్రదేశ్‌‌లోని మతౌలీ అనే మారుమూల ప్రారంభించి ఆరేళ్ల తరువాత జనవరి 18, 1927 న నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌చే భవన ప్రారంభోత్సవం చేయబడినది. వృత్తాకారం‌లో నిర్మించబడిన ఈ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌‌లో మధ్యన ఉన్న భవనాన్ని నాడు చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌‌‌గా వాడుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత దాన్ని భారత ప్రభుత్వం పార్లమెంటు లైబ్రరీ హాల్‌గా మార్చింది. నాటి స్టేట్ కౌన్సిల్‌ను రాజ్యసభగా, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని లోక్‌సభగా వినియోగిస్తోంది. భారత పార్లమెంటు నిర్మాణానికి స్పూర్తినిచ్చిన చౌసత్ యోగిని ఆలయం గురించి తెలుసుకుందామా?
వృత్తాకారం‌లో నిర్మించబడిన ఈ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌‌లో మధ్యన ఉన్న భవనాన్ని నాడు చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌‌‌గా వాడుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత దాన్ని భారత ప్రభుత్వం పార్లమెంటు లైబ్రరీ హాల్‌గా మార్చింది. నాటి స్టేట్ కౌన్సిల్‌ను రాజ్యసభగా, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని లోక్‌సభగా వినియోగిస్తోంది. భారత పార్లమెం‌‌‌‌‌ట్ నిర్మాణానికి స్పూర్తినిచ్చిన చౌసత్ యోగిని ఆలయం గురించి తెలుసుకుందామా?

చౌసత్ యోగిని ఆలయం:


చౌసత్ యోగిని ఆలయం మధ్యప్రదేశ్‌‌లోని బుం‌‌‌దేల్‌‌ఖం‌డ్ ప్రాంతం‌లో మొరీనా జిల్లాలో కల మతౌలీ అని పిలవబడే మారుమూల గ్రామం‌లో ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 11 వ శతాబ్ధం‌లో దేవపాల్ అని పిలవబడే రాజు పాలనలో నిర్మించినట్లు చెపుతారు. ఈ అలయాన్నే ఏకత్తార్సో మహదేవ ఆలయం అని కూడా పిలుస్తారు.

సుమారు 100 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉన్న ఈ ఆలయం వలయాకారంలో 170 అడుగుల (52 మీ) వ్యాసార్థంతో ఉంటుంది. దాని లోపలి భాగంలో 64 చిన్న గదులులలో ప్రతి మండపం‌‌లో 64 యోగిని విగ్రహాలు ఉన్నాయి, చౌసత్ అంటే అరవై నాలుగు అందుకే చౌసత్ యోగిని దేవాలయం అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణం‌తో వేరుచేయబడి మధ్యలో కల గర్బ మండపం‌లో ప్రధాన దైవమైన శివుడు ఏక లింగ రూపం‌‌లో నెలకొని ఏకాటేశ్వరునిగా పిలువబడుతున్నాడు.

చౌసత్ యోగిని ఆలయం‌‌కు ఎలా వెళ్ళాలి?

మధ్యప్రదేశ్‌‌లోని చౌసత్ యోగిని ఆలయం‌‌ నెలకొని ఉన్న మతౌలీ గ్రామంకు విమాన, రైల్ మరియు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మతౌలీ దగ్గరలో ఉన్న నగరం గ్వాలియర్.

పార్లమెంటు హౌస్‌‌‌కు ఎలా వెళ్ళాలి?

ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో గల పార్లమెంటు హౌస్‌‌‌కు టాక్సీలు, ఆటోలు, ఆన్‌లైన్ క్యాబ్ మరియు మెట్రో రైలు ద్వారా చేరుకోవచ్చు.

మెట్రో స్టేషన్:
సమీప మెట్రో రైలు Central Secretariat కలదు. ఇక్కడి నుండి నడక ద్వారా లేదా ఆటో ద్వారా చేరుకోవచ్చు,
బస్ స్టేషన్:
పార్లమెంటు చేరుకోవడానికి బస్ సదుపాయం లేదు. పార్లమెంటు చేరుకోవడానికి బస్ సదుపాయం లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...