ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వడక్కునాథన్ దేవాలయం, త్రిసూర్, కేరళ


వడక్కునాథన్ దేవాలయం (Vadakkunnathan Temple) కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. కైలాస అధిపతి అయిన మహా శివుడు, ఈ దేవాలయంలో "వడక్కు నాథర్"గా పూజలందుకుంటున్నారు. "వడ" అనగా ఉత్తర ప్రాంతం, "నాథర్" అంటే అధిపతి అని స్థానిక భాషలో అర్థం. వడక్కునాథన్ దేవాలయం కేరళలోనే కాక, భారతదేశంలోనూ అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. త్రిసూర్ నగరం "దక్షిణ కైలాసం"గా ప్రసిద్ధి పొందింది. 2017 సంవత్సరంలో యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది.

వడక్కునాథన్ ఆలయ స్థల పురాణం:

వడక్కునాథన్ ఆలయ పూర్వకథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. పురాణ కథనం ప్రకారం, పరశురాముడు క్షత్రియులను తుదముట్టించిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం యజ్ఞం చేసి, తన భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు. తపస్సు చేయటానికి తగిన భూమి కోసం వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు, గొడ్డలిని సముద్రంలో విసిరితే విసిరినంత మేరకు భూమి లభిస్తుందని చెప్పాడు. పరశురాముడు గొడ్డలిని విసిరాడు, సముద్రం వెనక్కి వెళ్లి కొంత భూమిని ప్రసాదించింది. ఈ భూమి కేరళగా ప్రసిద్ధి చెందింది. పరశురాముడు శివుడు, శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వంటి దేవతలను ఆహ్వానించి, శివుడికి ఇష్టమైన ప్రాంతం అని గ్రహించి, అక్కడ ఒక ఆలయం నిర్మించాడు.

ఆలయ నిర్మాణం:

వడక్కునాథన్ దేవాలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ దేవాలయం క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడింది. చోళ, చేరు, మరియు చలుక్య రాజుల కాలంలో ఈ ఆలయం ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది. పురాతన కేరళ శైలిలో దేవాలయం అద్భుతంగా నిర్మించబడింది. దేవాలయానికి నలువైపులా నాలుగు ప్రధాన గోపురాలు ఉన్నాయి. విశాలమైన ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి.


దైవ దర్శనం:

ద్వాపర యుగంలో అర్జునునికి మరియు మహేశ్వరునికి మధ్య జరిగిన యుద్ధం ఇక్కడే జరిగినట్లు నమ్ముతారు. ఈ పోరులో గాయపడిన గంగాధరునికి శ్రీ ధన్వంతరి ఆవు నేతితో ఉపశమనం కలిగించాడని చెబుతారు. అనంతరం, నెయ్యి అభిషేకం ఆచారంగా నిలిచింది. వేల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. నెయ్యి వలన శివలింగం చుట్టూ పెద్ద ఎత్తున తెల్లని శిఖరాల్లాంటి పొర ఏర్పడింది. ప్రత్యేకత ఏమిటంటే, ఇంత పెద్ద నెయ్యి ఉన్నా, అది కరగకపోవడం, దుర్వాసన రాకపోవడం, మరియు కీటకాలు ఉండకపోవడం అనేది ఆశ్చర్యకరం. ఆయుర్వేద వైద్యులు ఈ నేతిని దివ్య ఔషదంగా వాడుతుంటారు.



ముఖ్యమైన కార్యక్రమాలు:

దేవాలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పండుగ సమయంలో ఈ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
  • అష్టబంధన కలశం: వడక్కునాథన్ దేవాలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించబడే ప్రత్యేక పూజా కార్యక్రమం.
  • త్రిశూర్ పూరం: ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే ఈ ఉత్సవం ఏనుగుల కవాతు, పంచవాద్య మేళం, మరియు తీర్పూ కొలాటం వంటి కార్యక్రమాలతో ఆకట్టుకుంటుంది.

సమీప పర్యాటక ప్రదేశాలు:

  • వడక్కునాథన్ దేవాలయం సమీపంలో సాక్షి గణపతి ఆలయం, విల్వామంగళం సమాధి, త్రిసూర్ మ్యూజియం వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
  • త్రిసూర్ నగరానికి సుమారు 30 కి.మీ.ల దూరం‌లో గురువాయూర్‌లో సుప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయం కలదు.

వసతి:

త్రిసూర్ నగరంలో భక్తులు బస చేయడానికి స్థానిక ప్రవైట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆహారం:

ఇక్కడి హోటల్స్‌లో కేరళ సాంప్రదాయ ఆహారం లభిస్తుంది.


ఎలా చేరుకోవాలి:

త్రిసూర్ నగరం కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటి. ఈ నగరానికి రైలు, బస్సు, మరియు విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌ల నుండి ఆటోల ద్వారా లేదా టాక్సీల ద్వారా వడక్కునాథన్ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...