ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సెయింట్ ఫిలోమినా చర్చి




మైసూరు నగరంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. ఈ చర్చి ఆసియాలోనే రెండవ అతి పొడవైన చర్చిగా గుర్తింపు ఉంది. ఈ చర్చిని కాథలిక్ సెయింట్, రోమన్ కాథలిక్ చర్చి మార్టిర్ అయిన సెయిం‌ట్ ఫిలోమినా గౌరవార్ధం మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ నిర్మించారు.


టిప్పు సుల్తాన్ అనంతరం మైసూరు రాజ్యానికి రాజధానిగా శ్రీరంగపట్నం నుండి మైసూరు నగరానికి మార్చబడినది. అప్పుడు అనేక బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు వచ్చి మైసూరులో స్థిరపడినారు. అప్పటి మహారాజా కృష్ణరాజ వడయార్ III ఈ వ్యక్తుల కోసం ఒక క్రైస్తవ చర్చి అవసరాన్ని గుర్తించి, 1843 సంవత్సరంలో నిర్మించినారు. కాలక్రమం‌లో నగరం విస్తరించడం మరియు నగరంలో క్రిస్టియన్ జనాభా పెరుగుతుండగా ప్రస్తుత రూపంలో ఉన్న ఈ చర్చిని 1933 సంవత్సరంలో మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ IV తన తాత నిర్మించిన చిన్న చర్చి స్థానంలో పునర్నిర్మించారు.

ఈ చర్చి గోతిక్ శైలిలో జర్మనీలోని కొలోన్ కెథడ్రల్ చర్చి ప్రేరణతో నిర్మించబడింది. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. చర్చి టవర్లు న్యూయార్క్‌లోని సెయింట్ పాట్రిక్స్ చర్చిని ప్రతిబింబిస్తాయి. చర్చి టవర్లు 175 అడుగుల పొడవుగా ఉండి, చర్చి గొప్పతనాన్ని చాటుతుంటాయి. పర్యాటకులు సెయింట్ ఫిలోమినా మరియు హోలీ క్రిస్ట్ ల విగ్రహాలు చూడవచ్చు. చర్చిలోపల ఇంటీరియల్ గాజు పై క్రీస్తు పుట్టుక, శిలువ వేయు చిత్రాలు మరియు పునరుత్థానాన్ని చూడవచ్చు. అలాగే పాలరాతితో చేయబడిన సెయింట్ ఫిలోమినా విగ్రహం ఉంది. ప్రతిరోజు ఉదయం మరియు సాయింత్రం వేళలలో కన్నడ, తమిళం మరియు ఇంగ్లీష్ బాషలలో హోలి మాస్ నిర్వహిస్తారు.


ఎలా వెళ్ళాలి?

రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే ఈ నగరం అనుసంధానించబడి ఉన్నది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం

    ఘాటి సుబ్రహ్మణ్య (ఘటి సుబ్రహ్మణ్య) దేవాలయం బెంగుళూరు నగర శివారులో గల దొడ్డబళ్ళాపూర్ సమీపంలోని ఘాటి అని పిలువబడే గ్రామంలో నెలకొని వున్న సుప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రం. హిందువులు సుబ్రహ్మణ్య స్వామిగా పిలువబడే కార్తికేయుడు పార్వతి పరమేశ్వరుల పుత్రుడు మరియు సర్పాలకు అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని భావిస్తారు. అలాగే భక్తులు తమ జాతకంలో కుజ, కాలసర్ప దోషంచే సకాలంలో పెళ్ళికాని వారు సుబ్రహ్మణ్య స్వామిని పుజిస్తారు. నాగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రాన్ని ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తుంటారు.      సుబ్రహ్మణ్య క్షేత్రం: కర్ణాటక రాష్ట్రం నందు మూడు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది, మధ్య, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రాలు గా ప్రసిద్ధిచెందినవి. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ఆది సుబ్రహ్మణ్య క్షేత్రంగా, ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా మరియు పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా భక్తులు కొలుస్తారు. ఈ మూడు క్షేత్రాలను కలిపితే ఒక సర్ప...