ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మైసూరు రాజ కుటుంబీకుల ఉద్యానవనం: బృందావన గార్డెన్స్



పర్యాటకులకు గమ్యస్థానం అయినటువంటి మైసూరు నగరం‌లో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మైసూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్‌ను మైసూరుకు వచ్చే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రాంతాలలో ఒకటి.



మైసూరును చూడటానికి వచ్చే యాత్రికులు నగరానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ (KRS డ్యామ్) తీరాన ఉన్న ఈ ఉద్యానవనం విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉద్యానవనాన్ని సందర్శించటానికి ప్రతి సంవత్సరము సుమారు ఇరవై లక్షలు పైగా యాత్రికులు వస్తుంటారని అంచనా.



ఒకప్పుడు కృష్ణ రాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అని పిలిచే ఈ అందమైన ఉద్యనవనాన్ని కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ దిగువున కృష్ణరాజ వడయార్‌చే 1927 సంవత్సరంలో ప్రారంభించబడి 1932 వ సంవత్సరం‌లో పూర్తిచేయబడినది. కృష్ణ రాజ సాగర్ డ్యాంను భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యం‌లో కృష్ణరాజ వడయార్‌ - IV పేరు మీదుగా నిర్మించగా, డ్యాం క్రింది ప్రాంతం‌లో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ సారధ్యం‌లో కట్టించెను.


ప్రకృతి ప్రేమికులు బృందావనంలోని అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్‌లు, సరస్సులు కల ఈ ఉద్యానవనం అహ్లాదకరమైన సంధ్యా సమయాన్ని ఆస్వాదించవచ్చు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఉద్యానవనములోని రంగు రంగుల విద్యుదీప కాంతులతో పాటు సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది. వీటితో పాటు ఇక్కడి సరస్సులలో బోట్ రైడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

ఈ ఉద్యానవనం మెయిన్ గేట్ ఏరియా, సౌత్ గార్డెన్స్, నార్త్ గార్డెన్ మరియు చిల్డ్రన్స్ గార్డెన్లుగా వర్గీకరింపబడినది. ఉద్యానవనం‌లోనికి మెయిన్ గేట్ ద్వారా పవేశించగలరు. ఇక్కడ ద్వారానికి ఇరువైపులా గులాబి తోటలు అకట్టుకుంటాయి. సౌత్ గార్డెన్స్ నందు కావేరమ్మ సర్కిల్ నందు కల కావేరీ మాత విగహం కలదు. సౌత్ గార్డెన్స్‌లో కల గ్లాస్ హౌస్ నందు వివిధ రకాల మొక్కలను పర్యాటకులు వారి అభిరుచి మేరకు కొనుగోలు చేయవచ్చును. నార్త్ గార్డెన్స్ నందు మ్యుజికల్ ఫౌంటైన్ షోను తిలకించవచ్చు.



సందర్శన సమయాలు:

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మరియు శని, ఆది వారాలలో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు సంవత్సరములో ఎప్పుడైనను సందర్శించవచ్చు. ఉద్యానవనం మొత్తం చూసి రావటానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ సందర్శన ఉత్తమం.



ప్రవేశ రుసుము:

బృందావన గార్డెన్స్ సందర్శించేందుకు ప్రవేశ రుసుం చెల్లించాలి. నేను వెళ్ళినప్పుడు ప్రవేశ రుసుం ఈ విధంగా ఉన్నాయి.
  • పిల్లలకు (5 నుండి 10 సంవత్సరాలు) - రూ. 5/-,
  • పెద్దలకు - రూ. 15/-
  • గార్డెన్స్‌లో అనుమతి లేనిదే కెమెరా వాడరాదు. పెనాల్టీ 50 రూపాయలు.


ఎలా వెళ్ళాలి?

  • రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే మైసూరు నగరం అనుసంధానించబడి ఉన్నది.
  • మైసూరు సిటి బస్టాండు నుండి కె.ఆర్.ఎస్. డ్యాం వరకు అనేక ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు ఎల్లప్పుడూ తిరుగుతుంటాయి.
  • బెంగళూరు నుండి డ్యాం వరకు, మైసూర్ వరకు కూడా కె.ఎస్.ఆర్.టి.సి. బస్సులు నడుస్తుంటాయి.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...