ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మైసూరు మహారాజుల రాజ సౌధం అంబా విలాస్ ప్యాలెస్


రాజభవనాల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూరును సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన 7 రాజభవనాల్లో అంబా విలాస్ ప్యాలెస్ ఒకటి. దీనినే ‘మైసూరు ప్యాలెస్’ లేదా ‘మైసూరు మహారాజా ప్యాలెస్’ అని కూడా పిలుస్తుంటారు.


మైసూరు మహారాజ కుటుంబీకుల కొరకు ఈ ప్యాలెస్ భవనాన్ని నిర్మించారు. 14 వ శతాబ్దం‌లో నిర్మింపబడిన ఈ భవనం అనేక పర్యాయాలు పునర్మించి ప్రస్తుత ప్యాలెస్ భవనాన్ని నిర్మిచారు. బ్రిటీష్ ఆర్కిటెక్ అయిన హెర్నీ ఇర్విన్‌ సారధ్యం‌లో ఇండో సార్సెనిక్, ద్రవిడ, మొగలుల, రోమన్, మరియు ప్రాచ్య దేశాల నిర్మాణాల శైలిలో 1897 – 1912 సంవత్సరాల మధ్య నిర్మించబడినది. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ 41,47,913/- వ్యయం అయ్యింది. 1912 సంవత్సరములో ప్యాలెస్ నిర్మాణం పూర్తయినప్పటికి, తదనంతర కాలం‌లో ప్యాలెస్ ఆధునీకరణ పనులు జరిగాయి. ఈ ఆధునీకరణ పనులలోనే ప్రజా దర్బార్ నిర్మించారు.




ప్యాలెస్ భవనం తూర్పు దిక్కు అభిముఖంగా ఉంటుంది. రాజ భవనం‌లోనికి ప్రవేశించడానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారాన్ని ‘జయ మార్తాం‌‌డ ద్వారం’ అని, ఉత్తర ప్రవేశ ద్వారాన్ని ‘జయరామ ద్వారం’ అని, దక్షిణ ప్రవేశ ద్వారాన్ని ‘బలరామ ద్వారం’ అని, పశ్చిమ ప్రవేశ ద్వారాన్ని ‘వరాహ ద్వారం’ అని పిలుస్తారు. సాధారణ యాత్రికులను దక్షిణమున గల వరాహ ద్వారం నుండి ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. సందర్శకులు ప్రవేశ రుసుం చెల్లించాలి మరియు చెప్పులతో సందర్శకులను అనుమతించరు (చెప్పులు భద్ర పరుచుటకు అవకాశం ఉంది).





ప్యాలెస్‌లో ప్రవేశించిన సందర్శకులు ప్యాలెస్ అందాన్ని చూసి మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. మూడు అంతస్తుల కల ఈ ప్యాలెస్ నిర్మాణం‌లో మూడు గోపురాలకు గ్రే గ్రానైట్ ఉపయోగించారు. ప్యాలెస్ పైకప్పులు, స్తంభాలను ముడి ఇనుము ఉపయోగించారు. ప్యాలెస్ నిర్మాణం‌లో ఉపయోగించిన అద్దాలు, మార్బుల్ గ్రానైట్‌లు మరింత శోభను చేకూర్చాయి. ప్యాలెస్‌లో మైసూరు మహారాజుల కుటుంబ సభ్యుల చిత్ర పటాలు, వారు వాడిన దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, వారు సేకరించిన అందమైన పెయిం‌టింగ్స్, అరుదైన కళాఖండాలు వీక్షించవచ్చు. ప్యాలెస్‌లో దర్బార్ హాలు, అంబా విలాస్, 84 కిలోల స్వర్ణ అంబారీ, కళ్యాణ మండపం సందర్శకులను ఆకట్టుకుంటాయి. అలాగే దసరా ఉత్సవాల సందర్బంగా దర్బార్ హాలులో 200 కిలోల బంగారు సింహాసనాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. ఈ సింహాసనాన్ని పాండవులు ఉపయోగించిన సింహాసనం‌గా చెపుతారు.



ప్యాలెస్‌లో 14 - 20 శతబ్దాల మధ్యలో నిర్మించిన దేవాలయాలు కలవు. వీటిల్లో శ్రీ శ్వేత వరాహ స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, శ్రీ త్రినాయనేశ్వర స్వామి ఆలయం, శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి ఆలయం, శ్రీ కొడి బైరవ స్వామి ఆలయం, కిల్లి వెంకటరమణ స్వామి ఆలయం, శ్రీ భవనేశ్వరి దేవి ఆలయం, శ్రీ గాయత్రి దేవి ఆలయాలు ముఖ్యమైనవి.



దసరా ఉత్సవాల సందర్బంగా ఈ ప్యాలెస్ దీపపు కాంతులతో వెలిగిపోతుంది. ఈ ఉత్సవ ప్రారంభంలో బలరామద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫిరంగులను పేలుస్తారు. ప్రతి ఏటా అంబా విలాస్‌లోని బలరామద్వారం వద్ద ఉన్న నంది ధ్వజానికి పూజలు నిర్వహించడం ద్వారా జంబూ సవారీని అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారు. జంబూ సవారీని వీక్షించెందుకు దేశ విదేశాల నుండి లక్షలాది పర్యాటకులు వస్తారు.



సందర్శన సమయం:

  • ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5:30 వరకు సందర్శకులను అనుమతిస్తారు. సందర్శకులు ప్రవేశ రుసుం చెల్లించాలి. (నేను వెళ్ళినప్పుడు రూ 50/- గా ఉన్నది). 
  • సందర్శకులకు గైడ్ సౌకర్యం ఉంది.
  • ప్రతి ఆదివారం, దసరా ఉత్సవాలు మరియు మరియు ముఖ్య పర్వదినాల సందర్బంగా ఈ ప్యాలెస్ 97000 విద్యుత్ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.

లైట్ షో ప్రదర్శన:

  • ప్రతి రోజు మైసూరు రాజుల చరిత్ర గురించి సౌండ్ మరియు లైట్ షో ప్రదర్శన కలదు.
  • సోమవారం నుంచి బుధవారం వరకు రాత్రి 7 నుంచి 8 వరకు మరియు శనివారం రాత్రి 8.15 నుంచి 9.15 వరకు కన్నడ బాషలో ఉంటుంది.
  • గురువారం నుంచి శనివారం వరకు రాత్రి 7 నుంచి 8 వరకు ఇంగ్లీష్ బాషలో ఉంటుంది.
  • సౌండ్ మరియు లైట్ షో ప్రదర్శన వీక్షించెందుకు ప్రత్యేక రుసుం చెల్లించాలి. ప్యాలెస్ దక్షిణ ద్వారం వరాహ గేట్ కౌంటర్ వద్ద సాయింత్రం 6.30 నుండి టికెట్టులు ఇస్తారు.



ఎలా వెళ్ళాలి?

  • రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే ఈ నగరం అనుసంధానించబడి ఉన్నది.
  • ఈ ప్యాలెస్ మైసూరు సిటి బస్టాండ్‌కు వెనుక సుమారు 300 మీటర్ల దూరంలో ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...