ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యూఢిల్లీలోని లోటస్ టెంపుల్

Photo by Manish Sharma from Pexels

లోటస్ టెంపుల్ అనేది భారత రాజధాని నగరమైన న్యూఢిల్లీలోని బహపూర్‌లో గల ప్రఖ్యాత అపురూపమైన ప్రార్ధనా మందిరం. చూడడానికి పెద్ద తామర పువ్వు ఆకారంలో నిర్మితమై ఉండటం వలన ఈ మందిరానికి లోటస్ టెంపుల్ (కమల మందిరం)అనే పేరు వచ్చింది. అధునిక కాలం‌లో మన దేశం‌లోని అద్భుత నిర్మాణాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు.

ఈ ఆలయం‌ బహాయి మతానికి చెందినది. మానవ జాతి ఏకత్వాన్ని విశ్వసించే బహాయి మత సిద్ధాంతం ప్రకారం దేవుడు నిరాకారుడు. అందువలన ఈ ఆలయం‌లో ప్రత్యేకించి ఏ దేవుడు ఉండడు. ఇక్కడ ఏ మతాన్ని అవలంబించేవారైనా సరే వారి మత గ్రంధాలను వారి బాషలో జపించుకోవచ్చు లేదా చదువుకోవచ్చు కాని వాటిపై ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుమతించరు.

ప్రత్యేకమైన ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతాన్ని హైదరాబాద్‌కు చెందిన అర్దిషీర్ రుస్తం‌పూర్ (Ardishr Rustampur) విరాళంగా ఇచ్చారు. ఈ నిర్మాణం కోసం తన యావదాస్థిని ఇచ్చారు. ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్‌ సహ్‌బా (Fariborz Sahba) సారధ్యం‌లో ఈ ఆలయ నిర్మాణం ఆరేళ్లపాటు కొనసాగి నవంబర్ 13, 1986 న పూర్తయింది. యు.కె.కు చెందిన ఫ్లిం‌‌‌‌ట్ అం‌డ్ నీల్ అనే సంస్థ ఈ నిర్మాణానికి స్టృక్చరల్ డిజైన్ ఇవ్వగా, ఇ.సి.సి. కన్‌స్ట్రక్షన్ గ్రూప్ నిర్మాణాన్ని చేపట్టింది.

Photo by Sandeep Gusain from Pexels

లోటస్ టెంపుల్ నిర్మాణం:

ప్రత్యేకమైన ఈ ఆలయానికి ప్రేరణగా హిందు, బౌద్ధ, జైన మరియు ఇస్లాం మతాల వారు పవిత్రంగా భావించే తామర ఆకారం‌‌ను ఎంచుకున్నారు. 26 ఎకరాల విస్తీర్‌ంజలో నిర్మించిన ఈ ఆలయాన్ని 9 వైపుల మొత్తం 27 రేకులతో కూడిన వికసించే తామర ఆకారంలో 131 అడుగులు ఎత్తులో ఉండి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి కనిపిస్తూ ఉంటుంది. తొమ్మిది ద్వారాలతో ఈ ఆలయం లోపల 2500 మంది కూర్చోగలిగినంత విశాలమైన ధ్యానమందిరం ఉంటుంది. ఈ నిర్మాణం చుట్టూ ఏర్పరిచిన జలాశయాల మధ్య నీటిలో తేలియాడుతున్నట్టు కనిపిస్తుంది. గ్రీస్ దేశం‌లోని పెంటెలి పర్వతం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాతితో నిర్మించారు. సౌర శక్తి ఉపయోగించిన ఢిల్లీలోని మొట్టమొదటి ఆలయాలలో ఇది ఒకటి.

లోటస్ టెంపుల్ ప్రత్యేకతలు:

ఈ సుందర కట్టడాన్ని ప్రతి రోజు సగటున 8000 నుండి 10000 మంది సందర్శకులు వీక్షించుటకు ఇక్కడకి వస్తుంటారు. ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించిన భవనాలలో ఇది ఒకటి. దీని శిల్ప కళా వైభవానికి ప్రపంచవ్యాప్తం‌గా అనేక అవార్డులతో పాటు ప్రశంసలు వచ్చాయి. ఈ భవనాన్ని తాజ్‌మహల్‌లాగే పాలరాతితో నిర్మించడం వలన ఉత్తర అమెరికా ఇంజినీరింగ్‌ సంఘం 20వ శతాబ్దపు తాజ్‌మహల్‌గా బిరుదిచ్చింది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానియా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వంటి అనేక ప్రచురణలలో గుర్తింపు పొందింది. భారత దేశ ప్రభుత్వం ఈ కట్టడం చిహ్నం‌గా ఒక తపాలా బిళ్ళ కూడా విడుదల చేసింది.

లోటస్ టెంపుల్ సందర్శన సమయం:

  • శీతాకాలం‌లో లోటస్ టెంపుల్‌‌‌ను ఉదయం 09:30 నుండి సాయంత్రం 05:30 వరకు సందర్శించవచ్చును.
  • వేసవికాలం‌లో లోటస్ టెంపుల్‌‌‌ను ఉదయం 09:00 నుండి సాయంత్రం 07:00 వరకు సందర్శించవచ్చును.
  • లోటస్ టెంపుల్‌‌‌‌లో ప్రవేశం ఉచితం.
Photo by Swapnil Deshpandey from Pexels

లోటస్ టెంపుల్‌‌కు ఎలా వెళ్ళాలి?

లోటస్ టెంపుల్ ఢిల్లీలోని బహపూర్ ప్రాంతం‌లో ఉంది. బస్సులు, టాక్సీలు, ఆటోలు, ఆన్‌లైన్ క్యాబ్ మరియు మెట్రో రైలు ద్వారా చేరుకోవచ్చు. లోటస్ టెంపుల్‌కు సమీపం‌లో గల Kalkaji Mandir మెట్రో స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...