ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

భారతీయ అమర సైనికుల స్మృతి చిహ్నం ఇండియా గేట్

Image courtesy: Asif Methar (www.pexels.com) ఇండియా గేట్ (India Gate) న్యూ ఢిల్లిలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటి. నేను వృత్తి రీత్యా గుర్గావ్‌లో ఉన్నప్పుడు ఇండియా గేట్ దర్శించడం జరిగినది. ఈ పోస్ట్‌‌‌లో ఇండియా గేట్ విశేషాలు తెలుపుతాను. ఇండియా గేట్‌ చరిత్ర: భారతదేశపు రాజధాని నగరం న్యూ ఢిల్లిలోని రాజ్‌పథ్‌లో గల ఈ స్మృతి చిహ్నాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మరియు మూడవ ఆం‌గ్లో ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల తరపున పోరాడుతూ అసువులు బాసిన 90 వేల మంది భారతీయ అమర జవాన్ల జ్ఞాపకార్థం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వారు కట్టించారు. బ్రిటీష్ ఇంజనీరు అయిన సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఇండియా గేట్‌ స్మారక కట్టడాన్ని రూపకల్పన చేయగా, తేది 10-02-1921 న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌ పునాదిరాయి వేసాడు. 10 సంవత్సరాల అనంతరం తేది 12-02-1931 న లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రారంభం‌లో ఈ స్మృతి చిహ్నాన్ని 'ఆలిండియా మెమోరియల్ వార్'గా పిలిచేవారు. ఇండియా గేట్‌ డిజైన్: ఈ కట్టడం పారిస్‌లో గల ‘ఆర్చ్-డీ-ట్రయంఫ్’ (Arc de Triomphe) నిర్మాణ శైలి పోలి ఉంటుంది. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన ఎరుపు రంగు గ్రానైట్‌తో ఈ స...

ఖాండ్వాలోని దాదా ధునివాలే దర్బార్‌‌

భారతదేశం ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులకు ప్రసిద్ధి. అటువంటి గురువులలో ఒకరిగా పేరొందిన ధునివాలే దాదాజి యొక్క సమాధి మందిరం వెలసియున్న ‘దాదా ధునివాలే దర్బార్’ దర్శించడానికి మేము ఖాండ్వా పట్టణానికి వెళ్ళాము. ఖాండ్వాకి చేరుటకు మా స్వస్థలం అయిన కావలి నుండి నేరుగా ప్రయాణ మార్గం లేకపోవుట వలన మేము కావలి నుండి నవజీవన్ ఎక్స్‌‌‌ప్రెస్‌‌ ద్వారా మహారాష్ట్రలోని అకోలా జంక్షన్ చేరుకొని, అక్కడ నుంచి మరొక రైలు ద్వారా ఖాండ్వా పట్టణం చేరుకొన్నాము. ఈ బ్లాగ్ పోస్టు ద్వారా ఖాండ్వా విశేషాల గురించి చెపుతాను. ఖాండ్వా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిమార్ ప్రాంతం‌లో ఉన్న ఒక ప్రాచీన మరియు చారిత్రక పట్టణం. ఇది ఖాండ్వా జిల్లా యొక్క పరిపాలనా కేంద్రం. ఖాండ్వా జిల్లాను గతం‌లో తూర్పు నిమార్ జిల్లాగా పిలిచేవారు. ఇక్కడ పలు ప్రాచీన ఆలయాలు మరియు జైన మందిరాలు ఉన్నాయి. 12 వ శతాబ్దం‌లో జైన మతం పట్ల విశ్వాసం పెరగడం వలన ఖాండ్వా జైన మత ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధిచెందింది. 1818 వ సంవత్సరం‌లో ఖండ్వా జిల్లాను మరాఠీ పాలకుల నుండి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక బ్రిటీష్ పాలనలో ఖాండ్వా నిమార్ ప్రాంతంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా వ...

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

బాబా నడయాడిన షిరిడి క్షేత్రం

షిరిడి (షిర్డీ) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం. సాయి బాబా నడయాడిన షిరిడిని జీవితం‌లో ఒక్కసారైనా దర్శించాలని ఆయన భక్తులు ఆకాంక్షిస్తారు. ఇక్కడి నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర్‌ను దర్శించడానికి దేశం‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సాయి బాబా అసలు పేరు, జన్మ స్థలం, తల్లిదండ్రులు గురించి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం శ్రీ సాయి బాబా తన 16వ వయస్సులో షిరిడికి వచ్చి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి తరువాత కొంత కాలం కనిపించలేదని ఆయన భక్తులు భావిస్తారు. ఆ కనుపించని సమయం‌లో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. పిదప కొంత కాలానికి ఔరంగాబాద్ జిల్లా ధూప్ ఖేడా గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే వ్యక్తి తన బావమరిది కొడుకు పెళ్ళి కోసం ఎడ్లబండిలో షిరిడీ వెళుతుండగా వారితో పాటు కలిసి షిరిడి వచ్చారని భావిస్తారు. ఆయన షిరిడి వచ్చినప్పుడు ఖండోబా ఆలయ సమీపంలో ఆలయ పూజారి మహల్సాపతి “ఆవో సాయీ” (తెలుగులో రండి సాయీ అని అర్ధం) అని పిలిచారు. ఆ విధంగా “సాయి” అనే పేరు స్థిరపడి ఆయన “షిరిడి సాయి బాబా”గా ప్రసిద్ధుడైనాడు. షిరిడీలో ఒక పాత మసీదులో నివసించేవాడు. ఈ మసీదునే “ద్వారక...

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

అరుణాచలేశ్వరుడు నెలకొనివున్న అరుణాచలం ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రము. దీనినే తమిళులు ‘అణ్ణామలై’ లేదా ‘తిరువణ్ణామలై’ అంటారు. తిరువణ్ణామలై తమిళనాడు రాష్టంలో ఉన్న తిరువణ్ణామలై జిల్లాలో వెలసి ఉంది. ఇది శైవులకు ఎంతో ముఖ్యమైన క్షేత్రము. తిరువణ్ణామలై పంచ భూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం పంచలింగ క్షేత్రములలో అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు తమిళనాడులోని చిదంబరం క్షేత్రం ఆకాశమును, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తి క్షేత్రం వాయువును, తమిళనాడులోని తిరువనైకోవిల్ క్షేత్రం నీటిని మరియు తమిళనాడులోని కంచి క్షేత్రం భూమిని సూచిస్తాయి. స్థల పురాణం: పూర్వం బ్రహ్మ విష్ణువుల మద్య జరిగిన తగువును తీర్చడానికి మహా శివుడు వారిద్దరి మద్య అగ్ని లింగంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఉద్బవించిన ప్రకాశవంతమైన కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు సకల దేవతలు ప్రార్ధించగా మహా శివుడు ఎర్రని శిల (కొండ) రూపం‌లో సాక్షాత్కరించాడు అదే అరుణాచలముగా పిలవబడుతుంది. అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ అని అర్ధము. ఎర్రని అరుణ రూపం‌లో వెలసిన పర్వతం కనుక అరుణాచలంగా ప్రసిద్ధిచెందింది. అలాగే 'అణ్ణాల్‌...

మైసూరులో నెలకొనివున్న శ్రీ చాముండేశ్వరీ ఆలయం

శ్రీ చాముండేశ్వరీ ఆలయం కర్ణాటక రాష్ట్రం‌లోని ప్రధాన నగరాలలో ఒకటైన మైసూరు నగరానికి తూర్పున సుమారు 12 కి.మి.ల దూరం‌లో గల చాముండీ పర్వతం‌పై నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. ఈ నగరాన్నే క్రౌంచపురి, క్రౌంచ పట్టణం, క్రౌంచ పీఠంగా పిలుస్తుంటారు. పురాణ ప్రాశస్థం: పూర్వం మహిషపురిగా పిలవబడే ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. ఈ రాక్షసుడు పరమశివుడిని తన కఠోర తపస్సుతో మెప్పించి, లోకం‌లోని ఏ పురుషుడి చేతిలో మరణించకుండా వుండేలా వరం పొందాడు. మహిషాసురుడుని వధించుటకై శ్రీ చాముండేశ్వరీ దేవి శక్తి స్వరూపిణిగా అవతరించి, మహిషాసురుని సంహరించి మహిషాసురమర్ధినిగా ప్రసిద్ధమైనది. శక్తి పీఠం: హిందూ పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయం‌లో సతీ దేవి ప్రాణ త్యాగం చేసినప్పుడు, పరమ శివుడు ఆమె శరీరాన్ని తన భుజాన వేసుకొని రుద్రతాండవం చేశాడు. ఆ సమయం‌లో విష్ణు దేవుడు తన చక్రం‌తో ఆమె శరీరాన్ని ఖండించగా, ఆ శరీర బాగాలు దేశం‌లోని పద్దెనిమిది ప్రాంతాలలో పడి ఆ ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్దిగాంచాయి. వాటిలో నాల్గవ శక్తి పీఠమే శ్రీ చాముండేశ్వరీ క్షేత్రం. ఈ పీఠం‌పై...

మైసూరు రాజ కుటుంబీకుల ఉద్యానవనం: బృందావన గార్డెన్స్

పర్యాటకులకు గమ్యస్థానం అయినటువంటి మైసూరు నగరం‌లో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మైసూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్‌ను మైసూరుకు వచ్చే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రాంతాలలో ఒకటి. మైసూరును చూడటానికి వచ్చే యాత్రికులు నగరానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ (KRS డ్యామ్) తీరాన ఉన్న ఈ ఉద్యానవనం విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉద్యానవనాన్ని సందర్శించటానికి ప్రతి సంవత్సరము సుమారు ఇరవై లక్షలు పైగా యాత్రికులు వస్తుంటారని అంచనా. ఒకప్పుడు కృష్ణ రాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అని పిలిచే ఈ అందమైన ఉద్యనవనాన్ని కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ దిగువున కృష్ణరాజ వడయార్‌చే 1927 సంవత్సరంలో ప్రారంభించబడి 1932 వ సంవత్సరం‌లో పూర్తిచేయబడినది. కృష్ణ రాజ సాగర్ డ్యాంను భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యం‌లో కృష్ణరాజ వడయార్‌ - IV పేరు మీదుగా నిర్మించగా, డ్యాం క్రింది ప్రాంతం‌లో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ సారధ్యం‌లో కట్టించెను. ప్రకృతి ప్రేమికులు బృందావనంలోని అందమైన మొక్కలు, పచ్చిక బయళ...